‘టీ’ తీసుకురాలేదని సర్జరీని మధ్యలోనే ఆపేసిన డాక్టర్!

Nagpur doctor leaves surgery midway for not getting tea
  • ట్యూబెక్టమి సర్జరీ చేయకుండా ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయిన వైద్యుడు
  • నాగ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చిన ఘటన
  • విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్న జిల్లా అధికారులు
‘కప్పు టీ’ తీసుకురాలేదనే అసహనంతో ఓ వైద్యుడు సర్జరీని మధ్యలోనే ఆపి వేసిన ఘటన నాగ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. నగరంలోని మౌడా ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. డాక్టర్ భాలవి ఆసుపత్రి సిబ్బందిని ఒక కప్పు టీ ఇవ్వాలని కోరారు. కానీ అందివ్వకపోవడంతో ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయారు. స్టెరిలైజేషన్ సర్జరీని (ట్యూబెక్టమి) సగంలోనే వదిలేసి వెళ్లారు. సర్జరీల కోసం 8 మంది మహిళలను హాస్పిటల్‌కు పిలిపించారు. అప్పటికే అనస్థీషియా ఇవ్వడంతో నలుగురు మహిళలు మత్తులోకి జారుకుని ఉన్న సమయంలో డాక్టర్ భాలవి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు.

బాధిత మహిళల కుటుంబ సభ్యులు జిల్లా వైద్యాధికారిని సంప్రదించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందిత వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆస్పత్రికి మరో వైద్యుడిని పిలిపించినట్టు జిల్లా మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు. ఈ నిర్లక్ష్యపూరిత ఘటనపై నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సీఈవో సౌమ్యశర్మ స్పందించారు. ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. కమిటీ నివేదిక ఆధారంగా వైద్యుడిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Go Back to Shorts
Nagpur
Doctor
Maharashtra
Operation

More Telugu News