Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • తీవ్ర ఒడిదుడుకుల మధ్య ముగిసిన ట్రేడింగ్
  • 16 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 5 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ఆద్యంతం ఒడిదుడుకుల్లో సూచీలు కదలాడాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 16 పాయింట్లు కోల్పోయి 64,942కి పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 19,406 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (1.95%), ఎన్టీపీసీ (1.51%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.20%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.11%), యాక్సిస్ బ్యాంక్ (1.06%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-0.99%), రిలయన్స్ (-0.64%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.63%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.52%), ఐటీసీ (-0.47%).   

More Telugu News