12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ
- నాలుగు విడతలుగా 100 మంది అభ్యర్థుల ప్రకటన
- మునుగోడు నుంచి బరిలోకి చలమల కృష్ణారెడ్డి
- చెన్నూరు నుంచి దుర్గం అశోక్.. సిద్దిపేట నుంచి దూది శ్రీకాంత్రెడ్డి బరిలోకి
అభ్యర్థులు వీరే..
బీజేపీ ప్రకటించిన తాజా జాబితా ప్రకారం.. చెన్నూరు నుంచి దుర్గం అశోక్, ఎల్లారెడ్డి నుంచి సుభాష్రెడ్డి, వేములవాడ నుంచి తుల ఉమ, హుస్నాబాద్ నుంచి శ్రీరామ్ చక్రవర్తి, సిద్దిపేట నుంచి దూది శ్రీకాంత్రెడ్డి, వికారాబాద్ నుంచి నవీన్కుమార్, కొడంగల్ నుంచి బంటు రమేశ్కుమార్, గద్వాల నుంచి బోయ శివ, మిర్యాలగూడ నుంచి సాదినేని శ్రీనివాస్, మునుగోడు నుంచి చలమల కృష్ణారెడ్డి, నకిరేకల్ నుంచి మొగులయ్య, ములుగు నుంచి అజ్మీర ప్రహ్లాద్ నాయక్ బరిలోకి దిగుతున్నారు.