Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడికి నోటీసులు పంపిన కోల్ కతా పోలీసులు

  • నేడు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్
  • టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్
  • బ్లాక్ లో టికెట్లు అమ్మారంటూ పోలీసులకు ఫిర్యాదులు
  • 19 మందిని అరెస్ట్ చేసిన కోల్ కతా పోలీసులు
  • టికెట్ల అమ్మకం వివరాలు తెలపాలంటూ బీసీసీఐ చీఫ్ కు నోటీసులు
Kolkata police send notice to BCCI President Roger Binny

ఇటీవల కాలంలో భారత్ లో క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు కొన్నిసార్లు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా, కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న టీమిండియా-దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్మారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 

ఈ మెగా టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్ లకు స్టేడియాలు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ టికెట్లకు కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. టికెట్లను బ్లాక్ లో అమ్మారంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. 

రంగంలోకి దిగిన పోలీసులు 7 కేసులు నమోదు చేసి 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. 108 మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, కోల్ కతా పోలీసులు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి నోటీసులు పంపారు. టికెట్ల అమ్మకం వివరాలను సమర్పించాలని స్పష్టం చేశారు.

More Telugu News