ఆంటీ అన్నాడని కండక్టర్ పై కేసు పెట్టిన 57 ఏళ్ల మహిళ.. తమిళనాడులో ఘటన
- భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు
- కేసు నమోదు చేసుకున్న రెడ్ హిల్స్ పోలీసులు
- విచారించి చర్యలు తీసుకుంటామని వెల్లడి
మరోమారు ఆంటీ అనడంతో నిర్మలాదేవి అభ్యంతరం చెప్పారు. దీనిపై కండక్టర్ తో వాదనకు దిగారు. కండక్టర్ వినిపించుకోకపోవడంతో తన భర్తకు ఫోన్ చేసి రెడ్ హిల్స్ కు పిలిపించుకున్నారు. బస్సు దిగాక భర్తతో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కండక్టర్ పై ఫిర్యాదు చేశారు. బస్సు, కండక్టర్ పేరు వివరాలు చెప్పి.. తనను ఆంటీ అని పిలిచి అవమానించాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మలాదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, పోలీసులు విచారణ చేపట్టారు.