తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్పై కేసు నమోదు
- తనను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని పార్టీ సమన్వయకర్త ఏఎస్ రావు ఫిర్యాదు
- వారి దాడిలో తన కుడి కంటికి గాయమైందని ఆరోపణ
- ఏఎస్ రావుపై గోషామహల్ ఇన్చార్జ్ ప్రశాంత్ యాదవ్ ఫిర్యాదు
మరోవైపు డాక్టర్ ఏఎస్ రావుపైనా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అక్టోబర్ 29న పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన అమర్యాదగా వ్యవహరిస్తూ నానా రభస చేశారని గోషామహల్ ఇన్చార్జి ప్రశాంత్ యాదవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఈ ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.