25 ఏళ్ల రాజకీయ ప్రయాణంపై భావోద్వేగంగా స్పందించిన విజయశాంతి
- అప్పుడు ఇప్పుడూ సంఘర్షణే ఎదురవుతోందని వ్యాఖ్య
- ఏనాడూ ఏ పదవీ కోరులేదని వెల్లడి
- పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డలు అందరూ సగౌరవంగా ఉండాలని ఆకాంక్ష
‘‘ నాడు తెలంగాణ ఉద్యమ బాటలో తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప, ఇయ్యాల్టి బీఆర్ఎస్కు వ్యతిరేకం అవుతామని పోరాటం చేయలేదు. నా పోరాటం నేడు కేసీఆర్ కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప , నాతో కలిసి తెలంగాణా ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు. రాజకీయపరంగా విభేదించినప్పటీకి అన్ని పార్టీల తెలంగాణ బిడ్డలు అందరూ సంతోషంగా, సగౌరవంగా ఉండాలని మనఃపూర్వకంగా కోరుకోవటం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశ్యం... ఎప్పటికీ. హర హర మహాదేవ్. జై తెలంగాణ’’ అని అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.