gangula kamalakar: మంత్రి గంగులకు చెందిన ప్రచార రథాన్ని చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయుడు

  • ఎల్ఈడీ ప్రచార వాహనంపై దాడి చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు
  • కరీంనగర్‌లోని గోపాల్‌పూర్‌లో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
  • కేసు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు
Teacher attack on Gangula campaign vehicle with chappal

మంత్రి గంగుల కమలాకర్ ప్రచారరథంపై మంగళవారం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెప్పుతో దాడి చేసిన సంఘటన కరీంనగర్ నగరంలో చోటు చేసుకుంది. సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాకర్‌కు చెందిన ఎల్ఈడీ ప్రచార వాహనం నగరంలోని గోపాల్‌పూర్‌లో తిరుగుతోంది.  ఈ సమయంలో ఉపాధ్యాయుడు జగదేశ్వర్ ఆ వాహనాన్ని చెప్పుతో కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

More Telugu News