విజయనగరం జిల్లా రైలు ప్రమాదం.. నేడూ పలు రైలు సర్వీసుల రద్దు
- హవ్డా-సికింద్రాబాద్, హవ్డా-బెంగళూరు, షాలీమార్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసుల రద్దు
- భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్ షెడ్యూల్ మార్పు
- తిరుపతి-పూరి, తిరుపతి-విశాఖ, పలాస-విశాఖ రైళ్ల కూడా రద్దు
తిరుపతి-పూరి (17480) ఎక్స్ప్రెస్, పలాస-విశాఖ (08531) ప్యాసింజర్, తిరుపతి-విశాఖ (08584) ప్రత్యేక రైలు, విశాఖ-గుణుపూర్ (17240) ఎక్స్ప్రెస్లనూ రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు (18463) ప్రశాంతి ఎక్స్ప్రెస్నూ రీషెడ్యూల్ చేశారు. నేటి ఉదయం 5.40 గంటలకు బయలుదేరాల్సిన రైలు 10 గంటలకు వెళుతుందని చెప్పారు. రైలు ప్రమాదం నేపథ్యంలో నిన్న కూడా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.