కొచ్చి కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు
- వరుసగా మూడుచోట్ల పేలుడు.. ఒకరు మృతి
- పదుల సంఖ్యలో క్షతగాత్రులు
- ఆ సమయంలో 2 వేల మంది ఉన్నారన్న పోలీసులు
కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఫైర్, వైద్య సిబ్బందితో అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు. పేలుడు తర్వాత భారీగా పొగ అలుముకోవడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారని, అక్కడంతా గందరగోళం నెలకొందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు.