MS Dhoni: గొప్ప క్రికెటర్ గా నిలిచిపోవాలనే కోరిక లేదు: ధోనీ

  • భారత క్రికెట్ దిగ్గజాలలో ఒకడిగా నిలిచిన ధోనీ
  • మంచి మనిషిగా తనను అందరూ గుర్తుంచుకోవాలనేదే తన కోరిక అని వ్యాఖ్య
  • తుది శ్వాస వరకు మంచిగా ఉండాలన్న ధోనీ
MS Dhoni Says People Should Not Remember Him As A Good Cricketer

టీమిండియా లెజెండరీ క్రికెటర్లలో మాజీ కెప్టెన్ ధోనీ ఒకరు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ లను గెలిచి గొప్ప కెప్టెన్ గా నిలిచాడు. అంతేకాదు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఐదు సార్లు విజేతగా నిలబెట్టాడు. ఇండియాలో ప్రస్తుతం ధోనీకే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు వ్యక్తిగత జీవితం, విలువలకు ధోనీ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధోనీ మాట్లాడుతూ... ఒక గొప్ప క్రికెటర్ గా అందరి మనసుల్లో నిలిచిపోవాలనే కోరిక తనకు లేదని చెప్పాడు. ఒక మంచి మనిషిగా తనను అందరూ గుర్తుంచుకోవాలనేదే తన కోరిక అని అన్నాడు. మనం మంచి వ్యక్తిగా నిలిచిపోవాలంటే... తుది శ్వాస వరకు మంచిగా ఉండాలని చెప్పాడు.

More Telugu News