Botsa Satyanarayana: కోట్లు ఖర్చు చేసినా చంద్రబాబు అందుకే జైలు నుంచి బయటకు రావడం లేదు!: బొత్స

  • అధికారులను వాడుకొని అవినీతి చేసినట్లు రుజువు కావడం వల్లే బయటకు రావడం లేదన్న బొత్స
  • ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను తీసుకు వచ్చారని గుర్తు చేసిన మంత్రి
  • తన హయాంలో చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేశాడని ఆరోపణ
Botsa Satyanarayana says chandrababu arrested with proofs

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధికారులను వాడుకొని అవినీతి చేసినట్లు రుజువు కావడం వల్లే జైలు నుంచి బయటకు రావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పార్వతీపురంలో సామాజిక సాధికార సన్నాహ సమీక్షలో ఆయన మాట్లాడుతూ... కోట్లాది రూపాయలు ఇచ్చి ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను తీసుకు వచ్చినప్పటికీ ఆయన ఎందుకు బయటకు రావడం లేదో గుర్తించాలన్నారు. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. ఆధారాలతో అరెస్ట్ కావడం వల్లే ఈ రోజుకూ బయటకు రాలేదన్నారు. తన హయాంలో చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేశాడన్నారు.

టీడీపీ హయాంలో చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమమూ లేదని, కానీ తమ హయాంలో ఎన్నో చేపట్టామన్నారు. జగన్ నాయకత్వంలో పదవుల్లో ఎక్కువగా బలహీనవర్గాలకే దక్కుతున్నాయని తెలిపారు. తమ హయాంలో దళారి, మధ్యవర్తి వ్యవస్థలు లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం తమదే అన్నారు. నాలుగున్నరేళ్ళ కాలంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామన్నారు.

More Telugu News