హైదరాబాద్లో దారుణం.. మహిళపై మరో ఇద్దరు మహిళల లైంగికదాడి
- రహ్మత్నగర్ ప్రాంతంలో ఘటన
- భర్తతో గొడవపడి బస్టాండ్లో నిద్రించిన బాధితురాలితో మాటలు కలిపిన మహిళలు
- మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి మత్తమందు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చిన వైనం
- మత్తులోకి జారుకోగానే లైంగికదాడి
- ఆపై నాలుగు తులాల బంగారు గొలుసు, చెవికమ్మల దోపిడీ
ఆపై ఇక్కడ ఉండడం మంచిది కాదని, తమ ఇంట్లో పడుకుని ఉదయం వెళ్లిపోవాలని చెబుతూ బ్రహ్మశంకర్నగర్లోని తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడామెకు కూల్డ్రింక్ ఇచ్చారు. అది తాగిన బాధితురాలు మత్తులోకి జారుకుంది. మత్తులో ఉన్న ఆమెపై వీరిద్దరూ లైంగికదాడికి పాల్పడ్డారు. శరీరమంతా గోళ్లతో రక్కి గాయపర్చారు. ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు, చెవి కమ్మలు లాక్కున్నారు.
వారి చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు ఇంటికి చేరుకుని భర్తకు చెప్పింది. గాయాలతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రిలో చేర్చిన భర్త అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాధితురాలు నిన్న మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసహజ శృంగారంతోపాటు దోపిడీ, దొంగతనాలకు వారిద్దరూ పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో నిందితురాలి కోసం గాలిస్తున్నారు.