న్యూజిలాండ్-భారత్.. ఎవరికి ఎక్కువ విజయావకాశాలు?
- ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ పై న్యూజిలాండ్ దే పైచేయి
- అధిక విజయాలు కివీస్ జట్టుకే సొంతం
- 2003 తర్వాత కివీస్ చేతిలో భారత్ గెలిచింది లేదు
ఐసీసీ టోర్నమెంట్లలో న్యూజిలాండ్ ను భారత్ చివరిగా ఓడించింది ఎప్పుడో తెలుసా..? 2003 ప్రపంచకప్ లో. సౌరవ్ గంగూలీ సారథ్యంలో ఏడు వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది. ఆ తర్వాత నుంచి ఐసీసీ టోర్నమెంట్లలో న్యూజిలాండ్ తో ఆడిన ప్రతిసారీ భారత జట్టు చేదు ఫలితాలనే చవిచూసింది. 2016 టీ20 వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యమిచ్చింది. అయినా కానీ సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో మట్టికరిచింది. న్యూజిలాండ్ ను భారత బౌలర్లు 126 పరుగులకే కట్టడి చేశారు. కానీ, న్యూజిలాండ్ బౌలర్లు భారత్ పోరాటాన్ని 79 స్కోరుకే పరిమితం చేయడంతో 47 పరుగుల విజయం న్యూజిలాండ్ సొంతమైంది. 2019 వన్డే ప్రపంచకప్ లోనూ సెమీ ఫైనల్స్ లో భారత్ న్యూజిలాండ్ చేతిలో పరాజయం ఎదుర్కొన్నది. మరి ఈ విడత ఆట, అదృష్టం ఎవరి వైపు ఉంటుందో చూడాలి.