Natti Kumar: 'వ్యూహం' సినిమా విడుదల కాకుండా ఆపాలంటున్న నిర్మాత నట్టి కుమార్

Natti Kumar wants to stop Vyuham movie release
షార్ట్స్‌లో చూడండి
జగన్ రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం వ్యూహం. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, వ్యూహం సినిమా విడుదల కాకుండా ఆపాలంటూ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ను, కేంద్ర హోంశాఖను, తెలంగాణ ఎన్నికల ప్రధాన కమిషనర్ ను కోరుతున్నారు. 

ఈ చిత్రంలో జగన్ ను, వైసీపీని గొప్పగా చూపించి, విపక్షాలను తక్కువ చేసి చూపించారని నట్టి కుమార్ వెల్లడించారు. ఇది ఏపీకి సంబంధించిన ఇతివృత్తం అయినప్పటికీ, త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నందున తెలంగాణలోనూ ఈ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపారు. 

ఇందులో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ వంటి వాళ్లను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారని నట్టి కుమార్ ఆరోపించారు. ఈ అంశం తెలంగాణ ఓటర్లపై ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఈ పరిస్థితుల్లో వ్యూహం సినిమా విడుదల మంచిది కాదని పేర్కొన్నారు .
Go Back to Shorts
Natti Kumar
Vyuham
Release
Ram Gopal Varma
YS Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News