Natti Kumar: 'వ్యూహం' సినిమా విడుదల కాకుండా ఆపాలంటున్న నిర్మాత నట్టి కుమార్

  • వర్మ తెరకెక్కిస్తున్న పొలిటికల్ చిత్రం వ్యూహం
  • జగన్ జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా చిత్రం
  • నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న వ్యూహం
  • తెలంగాణలో ఎన్నికల వేళ ఈ సినిమా విడుదల మంచిది కాదన్న నట్టి కుమార్
Natti Kumar wants to stop Vyuham movie release

జగన్ రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం వ్యూహం. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, వ్యూహం సినిమా విడుదల కాకుండా ఆపాలంటూ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ను, కేంద్ర హోంశాఖను, తెలంగాణ ఎన్నికల ప్రధాన కమిషనర్ ను కోరుతున్నారు. 

ఈ చిత్రంలో జగన్ ను, వైసీపీని గొప్పగా చూపించి, విపక్షాలను తక్కువ చేసి చూపించారని నట్టి కుమార్ వెల్లడించారు. ఇది ఏపీకి సంబంధించిన ఇతివృత్తం అయినప్పటికీ, త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నందున తెలంగాణలోనూ ఈ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపారు. 

ఇందులో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ వంటి వాళ్లను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారని నట్టి కుమార్ ఆరోపించారు. ఈ అంశం తెలంగాణ ఓటర్లపై ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఈ పరిస్థితుల్లో వ్యూహం సినిమా విడుదల మంచిది కాదని పేర్కొన్నారు .

More Telugu News