Team India: పాక్ జట్టుకు అంత సీన్ లేదన్న భారత జట్టు మాజీ పేసర్

  • మన సీ టీమ్ కూడా ఆ జట్టును ఓడిస్తుందని శ్రీశాంత్ ధీమా
  • స్పోర్ట్స్ కీడా కార్యక్రమంలో మాట్లాడిన శ్రీశాంత్
  • ఇండియాతో ఫైనల్లో తలపడతామన్న పాక్ జట్టు డైరెక్టర్
Indias C Team Can Beat Pakistans Main XI Says Team India Ex Player Sreesanth

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పై భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ జట్టుకు భారత్ ను ఓడించేంత సీన్ లేదని తేల్చేశారు. ఇప్పుడున్న పాక్ జట్టును ఇండియా సీ టీమ్ కూడా ఓడిస్తుందని, ఇదే పరిస్థితి కొనసాగితే ఈ టోర్నమెంట్ లో ఫైనల్ దాకా చేరుకోవడం వారికి కలేనని స్పష్టం చేశారు. ఈమేరకు స్పోర్ట్స్ కీడా కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. టోర్నమెంట్ లో భాగంగా ఇటీవల జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టును రోహిత్ సేన చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్ తర్వాత బాబర్ అజాం కెప్టెన్సీలోని పాక్ జట్టు సామర్థ్యంపైన ఆ దేశ అభిమానులకూ సందేహాలు రేకెత్తాయి. పలువురు మాజీలు కూడా పాక్ జట్టు ఆట తీరుపై పెదవి విరుస్తున్నారు. అయితే, ఆ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ మాత్రం తమ ఆటగాళ్లపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాతో తమ జట్టు ఫైనల్ లో తలపడుతుందని ధీమాగా చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై శ్రీశాంత్ స్పందిస్తూ.. పాక్ జట్టు ఆటతీరు నాసిరకంగా ఉందని, భారత్ లోని సీ టీమ్ కూడా ఆ జట్టును ఓడిస్తుందని అన్నారు. ఇలాంటి టీమ్ తో భారత జట్టుపై ఆడి గెలవాలని అనుకోవడం అత్యాశేనని చెప్పారు. ఇలాగే ఆడితే ఫైనల్ దాకా చేరడం కూడా కష్టమేనని శ్రీశాంత్ విమర్శించారు.

More Telugu News