Stock Market: వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 115 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 19 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2 శాతం వరకు నష్టపోయిన నెస్లే ఇండియా షేరు విలువ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్లు ఆద్యంతం లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడాయి. అంతర్జాతీయ ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 115 పాయింట్లు నష్టపోయి 66,166కి పడిపోయింది. నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 19,731 వద్ద స్థిరపడింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.71%), టాటా స్టీల్ (1.60%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.20%), యాక్సిస్ బ్యాంక్ (1.13%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.78%). 

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.94%), టీసీఎస్ (-1.29%), ఏషియన్ పెయింట్స్ (-1.15%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.14%), సన్ ఫార్మా (-0.93%).

More Telugu News