Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత పిటిషన్
  • ఈ పిటిషన్ విచారణను బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు
  • 500 పేజీలతో కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
Chandrababu bail Petition postponed to wednessday

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్ ను బుధవారం విచారించనున్నట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ కు 500 పేజీల వివరణతో సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో చంద్రబాబు పిటిషన్ ను బుధవారం విచారిస్తామని పేర్కొంటూ విచారణను జడ్జి వాయిదా వేశారు.

More Telugu News