భుజాలపై మోసుకెళ్లి మావోయిస్టును కాపాడిన భద్రతా బలగాలు.. జార్ఖండ్ లో ఘటన
- ఎదురుకాల్పుల్లో గాయపడ్డ మావోయిస్టు.. వదిలేసి వెళ్లిన సహచరులు
- బుల్లెట్ గాయాలతో పడున్న మావోయిస్టును చూసి ఆసుపత్రికి తరలించిన భద్రతా బలగాలు
- హెలికాఫ్టర్ లో రాంచీకి తరలించి ఆసుపత్రిలో చేర్చిన వైనం
జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్ఛిమ సింగ్ భమ్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని హుస్పిపీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గాయపడ్డ మావోయిస్టును సహచరులు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. పారిపోయిన వారి కోసం వెతుకుతూ ముందుకెళ్లిన సెక్యూరిటీ సిబ్బందికి గాయపడ్డ మావోయిస్టు కనపడ్డాడు. దీంతో ఆ మావోయిస్టును కాపాడేందుకు వారు అతడిని భుజాలపై మోసుకెళ్లారు. హథీబురు క్యాంపునకు చేర్చి ప్రాథమిక చికిత్స అందించారు. ఆపై హెలికాప్టర్ లో రాంచీకి తరలించి ఆసుపత్రిలో చేర్పించారు.