మా అనుమానాలు మరింత బలపడుతున్నాయి: అచ్చెన్నాయుడు
- చంద్రబాబును జైల్లోనే చంపేందుకు కుట్రలు చేస్తున్నారన్న అచ్చెన్నాయుడు
- డాక్టర్లు తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇస్తున్నారని మండిపాటు
- ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందించాలని డిమాండ్
చంద్రబాబును అరెస్ట్ చేసి 38 రోజులు గడిచినా స్కిల్ కేసులో ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపించలేకపోయరని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఆయనను అన్యాయంగా జైల్లో ఉంచుతున్నారని దుయ్యబట్టారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని... చంద్రబాబును ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణులే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారని చెప్పారు.