Stock Market: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 483 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 141 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపై యుద్ధం ప్రభావం
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 483 పాయింట్లు నష్టపోయి 65,512కి పడిపోయింది. నిఫ్టీ 141 పాయింట్లు కోల్పోయి 19,512 వద్ద స్థిరపడింది. ఇజ్రాయెల్ - పాలస్తీనాల మధ్య యుద్ధ ప్రభావం మార్కెట్లపై పడింది. చమురు ధరలు పెరగడం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపై దీని ప్రభావం ఉంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.02%), టీసీఎస్ (0.47%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.47%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.05%), బజాజ్ ఫైనాన్స్ (-1.73%), టాటా స్టీల్ (-1.67%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.53%), కోటక్ బ్యాంక్ (-1.35%).

More Telugu News