ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఇంట్లో మరో విషాదం
- ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి జయరాం మరదలు మృతి
- తాజాగా మంత్రికి మాతృవియోగం
- అనారోగ్యంతో కన్నుమూసిన శారదమ్మ
- ఈ సాయంత్రం స్వగ్రామం గుమ్మనూరులో అంత్యక్రియలు
మంత్రి జయరాం మాతృమూర్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కొన్ని నెలల వ్యవధిలోనే రెండు మరణాలు సంభవించడంతో మంత్రి జయరాం కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కాగా, శారదమ్మ భౌతికకాయానికి పలువురు వైసీపీ నేతలు నివాళులు అర్పించారు. శారదమ్మ గతంలో గుమ్మనూరు గ్రామ సర్పంచిగా సేవలు అందించారు.