Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 364 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 108 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6 శాతం వరకు లాభపడ్ద బజాజ్ ఫిన్ సర్వ్ షేరు విలువ
Markets ends in profits for straight second day

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 65,996కి పెరిగింది. నిఫ్టీ 108 పాయింట్లు పుంజుకుని 19,654 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (5.86%), బజాజ్ ఫైనాన్స్ (4.05%), టైటాన్ (2.98%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.38%), ఐటీసీ (1.42%). 

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-0.93%), ఏసియన్ పెయింట్స్ (-0.37%), భారతి ఎయిర్ టెల్ (-0.29%), యాక్సిస్ బ్యాంక్ (-0.26%), ఎల్ అండ్ టీ (-0.13%).

More Telugu News