రాజమండ్రికి బయల్దేరిన నారా లోకేశ్.. మధ్యాహ్నం చంద్రబాబుతో ములాఖత్!
- నిన్న రాత్రి ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన లోకేశ్
- కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబును కలవనున్న యువనేత
- జనసేనతో సమన్వయం కోసం ఐదుగురిని ఎంపిక చేయనున్న లోకేశ్
నిన్న రాత్రే ఢిల్లీ నుంచి అమరావతికి లోకేశ్ వచ్చారు. మరోవైపు టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో కూడిన టీమ్ ను లోకేశ్ ఖరారు చేయనున్నారు. మరోవైపు మోతమోగిద్దాం తరహాలో రేపు మరో వినూత్నమైన కార్యక్రమానికి టీడీపీ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి సంబంధించి కీలక నేతల నుంచి లోకేశ్ సలహాలు తీసుకుంటున్నారు.