జగన్ మళ్లీ వస్తే మీ ఆస్తి పేపర్లు కూడా మీ దగ్గర ఉంచడు: పవన్ కల్యాణ్
- వారాహి యాత్రలో జగన్పై విరుచుకుపడ్డ జనసేన అధినేత
- విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఏపీ ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని ఆగ్రహం
- భవిష్యత్తులో ప్రజల ఆస్తుల దస్తావేజులు ప్రభుత్వం వద్దకు చేరుతాయని హెచ్చరిక
- ప్రజలను గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుందని వెల్లడి
ప్రజల ఆస్తులు వైసీపీ, జగన్ పాలయ్యే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. ఆడపిల్లలకు పసుపు కుంకుమల కింద ఇచ్చే ఆస్తుల దస్తావేజులు ప్రభుత్వపరం అవుతాయని చెప్పుకొచ్చారు. ప్రజల ఆస్తులతో ప్రభుత్వానికి సంబంధం ఏంటని నిలదీశారు. అంచెలంచెలుగా ప్రజల జీవితాలను తమ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతోందని హెచ్చరించారు.