అమెరికాలో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి
- న్యూజెర్సీలోని ప్లెయిన్స్బొరో ప్రాంతంలో బుధవారం వెలుగులోకొచ్చిన ఘటన
- పోలీసులు వెళ్లి చూడగా ఇంట్లో విగతజీవులుగా కనిపించిన భారతీయ జంట, వారి సంతానం
- భర్త తొలుత భార్యాపిల్లలను చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల అనుమానం
ప్రతాప్ సింగ్ తొలుత ఇంట్లో వారిని చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అక్కడి పోలీసులు భావిస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో ఎలాంటి కాల్పులు చోటుచేసుకోలేదని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు. భార్యాభర్తల్లో ఒకరు ఐటీ రంగంలో మరొకరు మానవవనరుల విభాగంలో పనిచేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. వారి కుటుంబం సంతోషంగానే కనిపించేదని, ఇంతటి ఘోరం జరుగుతుందని తాము అనుకోలేదని మృతుల బంధువులు తెలిపారు.