ఎమ్మెల్సీ అభ్యర్థుల తిరస్కరణ విషయంలో గవర్నర్ పై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
- కేసీఆర్ విశ్వబ్రాహ్మణులు, ఎరుకల జాతికి అవకాశమిచ్చారన్న హరీశ్ రావు
- గవర్నర్ను అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శ
- బీజేపీలో ఉండి తమిళిసై గవర్నర్ అయ్యారన్న హరీశ్ రావు
ఏ పార్టీ అయినా ఎరుకల జాతికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందా? బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఎన్నికైతే తప్పా? బీఆర్ఎస్ ఏమైనా నిషేధిత పార్టీనా? అని ప్రశ్నించారు. తమిళిసై బీజేపీలో ఉండి గవర్నర్ అయ్యారని, అలాంటప్పుడు కుర్రా సత్యనారాయణ బీఆర్ఎస్లో ఉండి ఎమ్మెల్సీ కావొద్దా? అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ వాళ్లకే నామినేటెడ్ పదవులు కట్టబెట్టారన్నారు. ఆ రాష్ట్రానికి ఒక నీతి, తెలంగాణకు మరో నీతి ఉంటుందా? అని నిలదీశారు.