Stock Market: నష్టాల నుంచి కోలుకుని లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • అమ్మకాలకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 406 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 110 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. కొన్ని సెషన్లుగా ప్రాఫిట్ బుకింగ్ చేసిన ఇన్వెస్టర్లు... ఈరోజు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 406 పాయింట్లు లాభపడి 65,632కి ఎగబాకింది. నిఫ్టీ 110 పాయింట్లు పెరిగి 19,546 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (2.35%), టైటాన్ (1.54%), టీసీఎస్ (1.48%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.19%), ఇన్ఫోసిస్ (1.19%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.26%), ఎన్టీపీసీ (-0.47%), నెస్లే ఇండియా (-0.46%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.26%), బజాజ్ ఫైనాన్స్ (-0.07%).

More Telugu News