Jagan: రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి బయల్దేరిన జగన్

  • ఈ సాయంత్రం నిర్మలా సీతారామన్ తో భేటీ
  • రేపు వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై సదస్సులో   పాల్గొననున్న సీఎం 
  • రేపు రాత్రి అమిత్ షాతో సమావేశం
Jagan leaves to Delhi

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి బయల్దేరు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు పయనమయ్యారు. ఈరోజు, రేపు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై ఆమెతో చర్చించనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరగనున్న సదస్సులో సీఎం పాల్గొననున్నారు. రేపు రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అవుతారు.

More Telugu News