Stock Market: మార్కెట్లకు ఈరోజు కూడా నష్టాలే

  • మార్కెట్లపై ప్రభావం చూపిన అంతర్జాతీయ ప్రతికూలతలు
  • 286 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 92 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టపోయాయి. ఈరోజు ఆద్యంతం మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 286 పాయింట్లు నష్టపోయి 65,226కి పడిపోయింది. నిఫ్టీ 92 పాయింట్లు కోల్పోయి 19,436 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (2.91%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.52%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.51%), ఇన్ఫోసిస్ (0.81%), టీసీఎస్ (0.61%). 

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-4.31%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.82%), ఎన్టీపీసీ (-2.55%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.38%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.22%).     

More Telugu News