Team India: ఆ రెండు యాప్స్‌ను నా ఫోన్‌ నుంచి తీసేశా: రోహిత్ శర్మ

  • 9 నెలలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న 
    భారత కెప్టెన్
  • ట్విట్టర్, ఇన్‌స్టాను తన ఫోన్‌లో లేవని వెల్లడి
  • రేపటి నుంచి భారత్‌లో వన్డే ప్రపంచ కప్‌
Rohit Sharma reveals he does not  have Twitter or Instagram on his phone for the past 9 months

సొంతగడ్డపై రేపటి నుంచి జరిగే వన్డే ప్రపంచ కప్ లో భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. చివరగా 12 ఏళ్ల కిందట స్వదేశంలో జరిగిన మెగా టోర్నీలో ధోనీసేన వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాతి రెండు ఎడిషన్లలో సెమీఫైనల్స్‌తోనే సరిపెట్టిన భారత్ ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని ఆశిస్తోంది. ఇందుకోసం దాదాపు ఏడాది నుంచి పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ తొలిసారి భారత జట్టును నడిపించబోతున్నాడు. ఈ టోర్నీలో జట్టును గెలిపించేందుకు రోహిత్ సైతం వ్యక్తిగతంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. 

గత తొమ్మిది నెలలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని రోహిత్ స్వయంగా వెల్లడించాడు. అసలు తన ఫోన్‌లో ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టా యాప్స్‌నే తొలగించినట్టు తెలిపాడు. ‘గత 9 నెలలుగా నా ఫోన్‌లో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లేవు. నేను ఏదైనా వాణిజ్య పోస్ట్ చేయాల్సి ఉంటే ఆ పని నా భార్య చూసుకుంటోంది. ఇవన్నీ ఆట నుంచి దృష్టిని మరలుస్తాయి. వీటిని చూడటం వల్ల సమయం, శక్తి రెండూ వృథా అవుతాయి. కాబట్టి వీటిని ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నా. ఫోన్‌లో ఉంటే చూస్తానని ఆ యాప్స్‌ను పూర్తిగా తొలగించా’ అని రోహిత్ వెల్లడించాడు.

More Telugu News