P Narayana: మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు

  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారాయణకు నోటీసులు
  • ఈ నెల 4న లోకేశ్ తో పాటు విచారణకు రావాలన్న సీఐడీ
  • ఇప్పటికే ఢిల్లీలో ఉన్న లోకేశ్ కు నోటీసులిచ్చిన సీఐడీ అధికారులు
CID issued notices to Ex minister P Narayana

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి పి.నారాయణకు సీఐడీ అధికారులు ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన టీడీపీ యువనేత నారా లోకేశ్ తో పాటు తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో లోకేశ్ ను ఏ14గా సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

More Telugu News