Bode Prasad: సాక్షి మీడియా ఎవరిది?: టీడీపీ నేత బోడె ప్రసాద్

  • జగన్ పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బోడె ప్రసాద్ విమర్శ
  • ప్రజా ఉద్యమాలను పోలీసులతో అణచి వేస్తున్నారని మండిపాటు
  • ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తే ప్రభుత్వ వ్యతిరేకత అర్థమవుతుందని వెల్లడి
Whose media is Sakshi asks Bode Prasad

ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ సీనియర్ నేత బోడె ప్రసాద్ విమర్శించారు. తనకు మీడియా లేదని జగన్ చెపుతారని, సాక్షి మీడియా ఎవరిదని ప్రశ్నించారు. ప్రజల ఉద్యమాలను పోలీసులతో అణచి వేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను ఎంత అణచివేస్తే వారు అంతగా తిరగబడతారని హెచ్చరించారు. ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తే వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని చెప్పారు. చంద్రబాబుకు సంఘీభావంగా పోరంకిలోని తన నివాసంలో బోడె ప్రసాద్ ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News