Aleru Mla: ఆలేరు ఎమ్మెల్యేకు ఫైన్ వేసిన హైకోర్టు

  • ఓ కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కోర్టు సీరియస్
  • రూ.10 వేల జరిమానా విధించిన హైకోర్టు జస్టిస్
  • వచ్చే నెల 3 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
Aleru Mla Gongadi Sunitha Fined By Telangana High Court

ఆలేరు ఎమ్మెల్యేపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై దాఖలైన కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని తప్పుబట్టింది. ఎమ్మెల్యే తీరుపై సీరియస్ అయిన కోర్టు.. రూ. 10 వేల జరిమానా విధించింది. అక్టోబర్ 3 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

2018 ఎన్నికల సందర్భంగా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పొందుపరిచారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌లో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. ఆస్తుల లెక్కలు సరిగా చూపలేదని, సునీత ఎన్నిక చెల్లదంటూ సతీశ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేకు ఫైన్ విధించిన కోర్టు.. ఈ కేసు విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.

More Telugu News