మోదీ సర్కారుకు పదికి 8 మార్కులు వేసిన ఒడిశా సీఎం
- విదేశాంగ పాలసీ బాగుందని కితాబు
- అవినీతి నిర్మూలనలో కేంద్రానికి ప్రశంసలు
- రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమన్న నవీన్ పట్నాయక్
ఇటీవల పార్లమెంట్ పాస్ చేసిన మహిళా బిల్లుపై ఒడిశా సీఎం స్పందిస్తూ.. మహిళా బిల్లు నిస్సందేహంగా గొప్ప ముందడుగు అని చెప్పారు. మహిళల అభివృద్ధి గురించి ఆలోచించడంలో, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఒడిశా ముందు ఉంటుందని వివరించారు. తన తండ్రి హయాంలోనే మహిళా రిజర్వేషన్లు అనధికారికంగా అమలు చేశారని పట్నాయక్ గుర్తుచేశారు. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించగా.. తమ ప్రభుత్వం దానిని 50 శాతానికి పెంచిందని వివరించారు. అలాగే కేంద్రం తీసుకొచ్చిన మిషన్ శక్తి పథకాన్ని పట్నాయక్ ప్రశంసించారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలను కూడా తమ సర్కారు స్వాగతిస్తోందని నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు.