టేకాఫ్ చేసిన గంటకే తిరిగొచ్చిన విమానం.. విశాఖ విమానాశ్రయంలో ఘటన

విశాఖపట్నం నుంచి ఆదివారం సాయంత్రం బయలుదేరిన ఓ ఎయిర్‌‌ ఇండియా విమానం గంటకే తిరిగొచ్చేసింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని వెనక్కు మళ్లించాల్సి వచ్చింది. దీంతో, సాయంత్రం 5.30కు బయలుదేరిన విమానం ఆరున్నర కల్లా విమానాశ్రయానికి తిరిగొచ్చేసింది. ఆ సమయంలో విమానంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత్‌నాయక్‌, మరో ముగ్గురు సభ్యులు ప్రయాణిస్తున్నారు. కాగా, రాత్రి తొమ్మిదిన్నరకు వారిని ఎయిర్‌ఇండియా మరో విమానంలో ఢిల్లీకి పంపించింది. మిగిలిన 165 మంది ప్రయాణికులకు వసతి, భోజనం ఏర్పాట్లు చేసింది.


More Telugu News