Rajamundry jail: చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రి జైలుకు ఉత్తరాల వెల్లువ

  • ‘బాబుతో నేను’ అంటూ వేలల్లో పోస్టు కార్డులు
  • నాలుగు రోజులుగా ఉత్తరాలు రాస్తున్న అభిమానులు
  • రాష్ట్రం నలుమూలల నుంచి పోస్టు కార్డుల ఉద్యమం
Post Card Movement in support to chandrababu

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ గొంతెత్తుతున్నారు. ప్రజలు తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్రంతో పాటు దేశవిదేశాల్లోనూ నిరసనలు చేస్తున్నారు. టీడీపీ అధినేతను ఉంచిన రాజమండ్రి కారాగారానికి నాలుగు రోజులుగా రోజూ వేలల్లో ఉత్తరాలు వస్తున్నాయి. ‘బాబుతో నేను’ అంటూ ప్రజలు పోస్టుకార్డులు రాసి పంపుతున్నారు. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ లతో పాటు ఆర్డినరీ పోస్టులో నిత్యం వేలాదిగా ఉత్తరాలు వస్తున్నట్లు జైలు అధికారులు చెబుతున్నారు.

చంద్రబాబుకు మద్దతుగా ఈ నెల 16 నుంచి పోస్టుకార్డుల ఉద్యమం మొదలుకాగా.. ఈ నెల 20న రాజమండ్రి జైలుకు 2,150 ఉత్తరాలు వచ్చాయని సమాచారం. ఈ నెల 21న 6,250, శుక్రవారం 8,340 కార్డులు, శనివారం ఏకంగా 23,570 పోస్టుకార్డులు అందినట్లు తెలుస్తోంది. వీటికి అదనంగా నాలుగు రోజుల్లో స్పీడ్ పోస్టులో 60 ఉత్తరాలు, రిజిస్టర్డ్ పోస్టులో 90 ఉత్తరాలు, ఆర్డినరీ పోస్టులో 300 ఉత్తరాలు రాజమండ్రి కారాగారానికి చేరినట్లు అధికారులు వెల్లడించారు.

More Telugu News