చేతులు కలిపిన కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య
- ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చిన పార్టీ పెద్దలు
- శ్రీహరి గెలుపునకు సహకరిస్తానని రాజయ్య ప్రకటన
- మంత్రి కేటీఆర్ తో సమావేశం అయిన ఇద్దరు నేతలు
దాంతో, రాజయ్య పార్టీ మారుతారన్న చర్చ జరిగింది. అయితే, రాజయ్యను బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. ఆయన మధ్యవర్తిత్వంతో రాజయ్య, కడియం శ్రీహరి మధ్య సయోధ్య కుదిరింది. రాజయ్యను ఆదుకుంటామని అధిష్ఠానం నుంచి హామీ వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో, సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చిన కడియంను గెలిపించేందుకు సహకరిస్తానని రాజయ్య ప్రకటించారు. కడియం, రాజయ్య ఇద్దరు మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కడియంకు రాజయ్య పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.