Andhra Pradesh: అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

  • ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టిన లారీ
  • బస్సు, లారీ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం
  • 40 మంది ప్రయాణికులకు గాయాలు.. పది మంది పరిస్థితి విషమం
Private Bus Accident In Annamayya District

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సును లారీ ఢీ కొట్టింది. దీంతో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు. సంబేపల్లె మండలం దేవపట్ల దగ్గర ఈ ప్రమాదం జరిగింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి, కడప సహా చుట్టుపక్కల ఆసుపత్రులకు తరలించారు.

కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో పలువురు బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. క్షతగాత్రులను ప్రొద్దుటూరు, జమ్మలమడుగు వాసులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తీర్థయాత్రల కోసం ప్రొద్దుటూరు నుంచి రామేశ్వరం బయలుదేరగా దేవపట్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు.

More Telugu News