ఔను.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ మృతి చెందాడు: జైళ్ల శాఖ డీఐజీ
- డెంగీ కారణంగా సత్యనారాయణ అనే ఖైదీ మృతి చెందాడన్న డీఐజీ
- దోపిడీ కేసులో ఈ నెల 6న జైలుకు వచ్చాడని వెల్లడి
- దోమల నివారణ కోసం సంబంధిత అధికారులతో కలిసి చర్యలు చేపట్టామన్న డీఐజీ
జైల్లో దోమల నివారణ కోసం సంబంధిత శాఖతో కలిసి చర్యలు చేపట్టామని... ఫాగింగ్ చేస్తున్నామని రవికిరణ్ తెలిపారు. ఫాగింగ్ ఈరోజు కూడా చేస్తామని చెప్పారు. జైల్లో దోమల లార్వాల ఆనవాళ్లేమీ లేవని చెప్పారు. మరోవైపు జైల్లో ఖైదీ చనిపోవడంతో టీడీపీ యువనేత నారా లోకేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే రీతిలో తన తండ్రిని చంపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.