గర్వంగా చెబుతా.. ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని హైదరాబాద్: కేటీఆర్
- హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో భారత్ సీరం అండ్ వాక్సిన్స్ సంస్థ కేంద్రం ఏర్పాటు
- భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్
- రూ. 200 కోట్ల పెట్టుబడి పెట్టిన బీవీఎస్ సంస్థ
భారత్ సీరం సంస్థకు అన్నిరకాల సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో ఫేజ్-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని ప్రకటించారు. ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని గర్వంగా చెప్పగలనని పేర్కొన్నారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. హైదరాబాద్లో ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయని కేటీఆర్ తెలిపారు.