Krishna River Tribunal: కృష్ణా నది ట్రైబ్యునల్ లో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

  • పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఇంటర్ లోకేటరీ అప్లికేషన్
  • 90 టీఎంసీల నీటిని తెలంగాణ వాడకుండా ఆపాలని విన్నపం
  • దీన్ని విచారించే అధికారం తమకు లేదన్న ట్రైబ్యునల్
Backlash to AP Govt in Krishna Tribunal

ఏపీ ప్రభుత్వానికి కృష్ణా ట్రైబ్యునల్ లో ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ ను ఏపీ ప్రభుత్వం వేసిన సంగతి తెలిసిందే. 90 టీఎంసీల నీటిని తెలంగాణ వాడకుండా ఆపాలంటూ ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ లో కోరింది. అయితే ఈ అప్లికేషన్ ను ట్రైబ్యునల్ కొట్టివేసింది. దీన్ని విచారించే అధికారం తమకు లేదని... దీనికి తగిన వేదికను ఆశ్రయించాలని ప్రభుత్వానికి సూచించింది.

More Telugu News