Chandrababu: రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసిన సిద్ధార్థ లూథ్రా

  • కోర్టులో జరిగిన పరిణామాలను చంద్రబాబుకు వివరించినట్లుగా సమాచారం
  • కేంద్రకారాగారం వద్దకు రాగానే కారును గేటు బయట నిలిపేసిన పోలీసులు
  • కారు దిగి లోపలకు నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్థ లూథ్రా
Sidharth Luthra meets Chandrababu Naidu in jail

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఆయన తరఫున వాదనలు వినిపిస్తోన్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా రాజమండ్రి కేంద్రకారాగారంలో కలిశారు. చంద్రబాబుతో ములాఖత్ సమయంలో కోర్టులో జరిగిన పరిణామాలను చంద్రబాబుకు ఆయన వివరించారని తెలుస్తోంది. అలాగే, బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సిద్ధార్థ లూథ్రా సాయంత్రం కేంద్రకారాగారం వద్దకు రాగానే పోలీసులు ఆయన కారును గేటు బయట ఆపేశారు. దీంతో ఆయన కారు దిగి లోపలకు నడుచుకుంటూ వెళ్లారు.

More Telugu News