Chelluboyina Venugopal Krishna: పవన్, పురందేశ్వరిలకు ఆ స్కాం కనిపించడం లేదా?: మంత్రి చెల్లుబోయిన

  • చంద్రబాబు ఆదేశాలతోనే స్కామ్ జరిగిందన్న చెల్లుబోయిన
  • కక్ష సాధించాల్సిన అవసరం వైసీపీకి లేదని వ్యాఖ్య
  • సీఐడీ విచారణలో అన్నీ వెలుగులోకి వస్తాయన్న మంత్రి
Chelluboyina fires on Pawan and Purandeswari

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ జరిగిందని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. ఆయన చేసిన స్కాం జనసేనాని పవన్ కల్యాణ్ కు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. తన చేతికి వాచ్ కూడా లేదని చెప్పుకునే చంద్రబాబు కోట్ల రూపాయల ఫీజులు చెల్లించి లాయర్లను ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. 

చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కక్ష సాధించాల్సిన అవసరం వైసీపీకి లేదని... కక్ష సాధించాలనుకుంటే ఇంత కాలం ఆగేవాళ్లం కాదని చెప్పారు. సీఐడీ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. 

More Telugu News