Stock Market: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 152 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 46 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2 శాతం పెరిగిన సన్ ఫార్మా షేరు విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ఊగిసలాట మధ్య ప్రారంభమైన మార్కెట్లు... ఆ తర్వాత  పుంజుకుని లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడి 65,780కి చేరుకుంది. నిఫ్టీ 46 పాయింట్లు పుంజుకుని 19,574 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (2.09%), టైటాన్ (1.27%), ఐటీసీ (1.26%), బజాజ్ ఫైనాన్స్ (1.06%), నెస్లే ఇండియా (0.98%). 

టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-1.46%), మారుతి (-0.93%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.57%), ఎన్టీపీసీ (-0.53%), విప్రో (-0.53%).

More Telugu News