మేడ్చల్ లో నీట మునిగిన అపార్ట్ మెంట్లు.. వీడియో ఇదిగో!
- మొదటి అంతస్తు వరకు చేరిన నీరు
- మైసమ్మగూడలో వరదలో చిక్కుకున్న జనం
- కాపాడాలంటూ ఇంజనీరింగ్ స్టూడెంట్ల ఆవేదన
మేడ్చల్ లోని మైసమ్మగూడ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలేజీల్లో చదివే విద్యార్థులు పక్కనే ఉన్న అపార్ట్ మెంట్లలో ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. చుట్టుపక్కల ఉన్న నాలుగు ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేసే సిబ్బంది కూడా ఈ అపార్ట్ మెంట్లలోనే ఉంటున్నారు. ప్రస్తుతం వరద ముంచెత్తడంతో వారంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు నీళ్లు వెళ్లే మార్గంలో అపార్ట్ మెంట్లు నిర్మించడంతో అక్కడ భారీగా వరద నీరు చేరింది.