Khushi: మూడు రోజుల్లో రూ.70 కోట్లు రాబట్టిన 'ఖుషి'

  • విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషి
  • శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాణం
  • సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం
  • తొలిరోజే రూ.30 కోట్ల గ్రాస్
  • చిత్రబృందంలో ఉత్సాహం 
Khushi collects Rs 70 cr gross in 3 days

విజయ్ దేవరకొండ, సమంత జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టయిన్ మూవీ ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికాలో ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఖుషి... ఏపీ, తెలంగాణలోనూ విశేషంగా ప్రేక్షకాదరణ పొందుతోంది. 

తొలి రెండ్రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం... మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ70.23 కోట్లు వసూలు చేసింది. కాగా, ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.53.5 కోట్లు.  ఖుషి తొలిరోజే రూ.30 కోట్లు వసూలు చేయడంతో చిత్రబృందంలో ఉత్సాహం నెలకొంది. తమ చిత్రం బ్లాక్ బస్టర్ అని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.

More Telugu News