tsrtc: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పిన టీఎస్ఆర్టీసీ

  • మరో విడత డీఏను పెంచుతున్నట్లు ప్రకటించిన చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి
  • జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న 5 శాతం డీఏను మంజూరు చేయాలని నిర్ణయం
  • ఇప్పటి వరకు 8 డీఏలు మంజూరు చేసినట్లు వెల్లడించిన బాజిరెడ్డి 
Good News for TSRTC employees

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు మరో విడత డీఏను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న 5 శాతం డీఏను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను చెల్లించనున్నట్లు వెల్లడించారు.

క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు ఎనిమిది డీఏలను మంజూరు చేసినట్లు బాజిరెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని, పెండింగ్‌ బకాయిలను త్వరలో ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోందన్నారు.

More Telugu News