Gudivada: గుడివాడ పాఠశాలలో దారుణం.. విద్యార్థులతో మూత్రశాల కడిగించిన వైనం

  • గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో దారుణం
  • పిల్లల చేత పనులు చేయిస్తున్న ప్రధానోపాధ్యురాలు
  • ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు
Head mistress of Gudivada school cleaned toilets with students

కృష్ణా జిల్లా గుడివాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయురాలు వారితో పాఠశాలలోని మూత్రశాలలను కడిగించారు. ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో చదివే విద్యార్థులతో ఆమె అన్ని పనులూ చేయిస్తున్నారు. వంట సిబ్బంది రాని సమయంలో కూడా వండిన పాత్రలను పిల్లలే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కొందరు పిల్లలు వడ్డిస్తుంటే, మరికొందరు భోజనం చేసే పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయురాలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పిల్లల చేత పనులు చేయిస్తున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News